కోతకు గురైన రోడ్డును మరమ్మత్తు చేయాలని సబ్ కలెక్టర్ కు గర్భాన సత్తిబాబు వినతి

పాలకొండ సబ్ కలెక్టర్ కు పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు, మరియు కూరాంగి నాగేశ్వరరావు, బాసూరు ప్రధాన రహదారి గెడ్డ కోతకు గురైందని, వినతి పత్రం అందజేశారు. పాలకొండ మండలం, భాసూరు గ్రామం, (బంగారమ్మ తల్లి గుడి) దగ్గర జంపరకోట గెడ్డ ఇటీవల కురిసిన వర్షాలకు అత్యధిక నీటి ప్రవాహం వలన, జంపరకోట గెడ్డ కోతకు గురైన సుమారు 20 అడుగులు రోడ్డును రెవెన్యూ అధికారి వారు పరిశీలించి, మరమ్మతులు చేపట్టాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గం జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ 2 సంవత్సరాలు నుంచి, వర్షాల కారణంగా తారు రోడ్డు కోతకు గురవుతూ వస్తుందని, ఈరోజు వరకు అధికారులు ఎవరూ చర్యలు తీసుకోకపోవడం అన్యాయం అన్నారు. ఈ రోడ్డు కోతకు గురవడం వలన దాదాపు 10 గ్రామాలకి రాకపోకలు ఇబ్బందికరంగా మారుతుందని ఆయన అన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.