జనరంజక పాలన జనసేనానితోనే సాధ్యం: బత్తుల

  • నియోజకవర్గంలో కొండలు, గుట్టలు, చెరువులు, ఇసుక తవ్వకాల్లో కోట్లాది రూపాయలు దోచేసి, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు ధైర్యంగా తరిమికొట్టాలి
  • “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర”కు మహిళల నీరాజనాలు
  • జనసేన పార్టీకి రోజురోజుకీ ప్రజల్లో పెరుగుతున్న విశేష ఆదరణ
  • రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్న జనశ్రేణులు
  • “జనంకోసం జనసేన – మహా పాదయాత్ర” 53వ రోజు

రాజానగరం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన “జనంకోసం జనసేన – మహా పాదయాత్ర”లో భాగంగా ఈరోజు పలువురు గ్రామస్తులను ఇంటింటికి వెళ్లి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలియజేసి, “గాజు గ్లాస్” గుర్తుకు ఓటు వేసి “జనసేన పార్టీ”ని గెలిపించాలని అభ్యర్థిస్తూ వీరమహిళల నేతృత్వంలో కార్యక్రమం గ్రామంలో సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ… రాబోయేది జనసేన ప్రభుత్వమని, పవన్ కళ్యాణ్ తోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, ప్రజా పరిపాలన తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజలను సమన్యాయం జరిగేలా ప్రచారంగక పాలన కొనసాగిస్తారని, భావితరాల భవిష్యత్తు కోసం అందరూ సమిష్టిగా జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున వీరమహిళలు, జనసైనికులు, నేతలు, శ్రీరంగపట్నం గ్రామప్రజలు పాల్గొన్నారు.