గట్టుగూడెం గ్రామం జనసేన ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్

టి.నర్సాపురం మండలం, గట్టుగూడెం గ్రామంలో జనసేన జిల్లా కార్యదర్శి తుటి రామచంద్రరావు ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన ప్లేయర్స్ కి ప్రథమ బహుమతి జనసేన మండల అధ్యక్షుడు అడపా నాగరాజు ద్వారా ద్వితీయ బహుమతి రామచంద్ర తృతీయ బహుమతి రాజు మాస్టర్ చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంకు మధు, లక్ష్మణ్, విజయ్, పాపారావు తదితరులు పాల్గొన్నారు.