బెల్లంకొండ సాయిబాబు ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

గిద్దలూరు నియోజక వర్గం, బెస్తవారపేట మండలం చెట్టిచేర్ల గ్రామంలో జగనన్న కాలనీలో పర్యటించిన జనసేన పార్టీ ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు. చెట్టిచేర్ల గ్రామంలో జగన్న కాలనీ 30 ఇళ్లు మంజూరు చేసినారు. ఇప్పటి వరకు కేవలం 1ఇల్లు మాత్రమే పూర్తి స్లాప్ వేశారు. ఇక్కడ స్మశానం ప్రక్కన ఇల్లు నిర్మించు కొనుటకు ప్రజలు ఇష్టపడటం లేదు, వాగు వచ్చినప్పుడు నీళ్లు వస్తాయని చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వైసిపి ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నారు అని జగనన్న ఇల్లు నిర్మించిన వారికి కన్నీళ్లు ఆని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లంకా నరసింహా రావు, కాల్వ బాల రంగయ్య, మండలం అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్, కళగొట్ల అల్లురయ్య, సిద్ధం వెంకటేశ్వర్లు, వీరనాల గోపాల్, శేషాద్రినాయుడు, మధు, దేవరాజ్, కంటా రమణయ్య తదితరులు పాల్గొన్నారు.