జగనన్న కాలనీలను పరిశీలించిన గౌతమ్ కుమార్

ఉరవకొండ నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాయంపల్లి రోడ్డు నందు గల జగనన్న కాలనీలను జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ జనసేన నాయకులతో కలసి శనివారం సందర్శించి, అక్కడ జరుగుతున్నటువంటి మోసాల గురించి మాట్లాడుతూ.. జగనన్న కాలనీలో పేదలకు ఇచ్చిన గృహాలు వంకల్లోనూ వాగులోను పట్టాలు ఇచ్చి పేదలను మోసం చేశారని, అవి వారికి ఉపయోగపడేవి కాదని అలాగే ఈ కాలనీలలో రోడ్లు వేయడం, కరెంట్ సప్లై ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమి చేసిన పాపాన పోలేదని, అక్కడ నడవడానికి కూడా వీలులేదని, ప్రస్తుతం పునాదులన్నీ శిధిలావస్థకు చేరుకుంటున్నాయని ఈ ప్రభుత్వం దాదాపుగా 6 లక్షల కోట్లు అప్పుచేసి ఎవరికోసం ఖర్చు పెట్టిందని కేవలం వారి కార్యకర్తల కోసమే అక్కడక్కడ ఇల్లులు కట్టించారని, పేద ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ కాలనీలను తప్పకుండా అభివృద్ధి చేస్తామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షలు చంద్ర శేఖర్, ఉపాదక్షులు రాజేశ్, ప్రధాన కార్యదర్శి రమేష్, మనికుమర్, చందు, రూపేష్, ఏర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.