టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయపోరాటానికి అండగా జనసేన

గత 7 రోజులుగా టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తిరుపతి ఎ డి బిల్డింగ్ వద్ద రోడ్డు మీద రాత్రి, పగలు ఆడవారితో సహా మాకు న్యాయం చేయండి మా కడుపు మీద కొట్టకండి అని చేస్తున్న నిరసనకు మద్దతుగా జనసేన వారి సమస్యల పరిష్కారం కొరకు ఎంత దూరమైన పోరాడుతామని వారికి మనోధైర్యం కలిగించడమే కాకుండా ఈరోజు వారికి సుమారు 2000 మందికి పైగా భోజన వసతులను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ మీకు అండగా జనసేన పార్టీ, మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ మరియు మేము ఎప్పుడూ మీ అందరికీ అండగా ఉంటాం. ఈ సమస్య మీద ఎంత దూరమైనా పోరాడుతామని అన్నారు.

అదేవిధంగా తిరుపతి ఇన్చార్జి శ్రీ కిరణ్ రాయల్ మాట్లాడుతూ టిటిడి ఉద్యోగుల సమస్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గతంలో ప్రెస్ నోట్ ద్వారా స్పందించారు, అవసరమైతే మరలా ఇంకొకసారి ప్రత్యక్షంగా కూడా స్పందిస్తారు అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు వీరమహిళలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.