క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌతమ్ కుమార్
ఉరవకొండ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయసాధనకు, నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యక్షులు వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉరవకొండ నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రవేశ పెట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంద్వారా సభ్యత్వాన్ని చేయించుకున్న ప్రతి కార్యకర్తకి బరోసా కల్పించడానికి ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5లక్షల భీమా చెక్కు, ప్రమాదంలో గాయపడిటే 50 వేలు హాస్పిటల్ ఖర్చులు పార్టీ నుంచి సహాయం చేసేలా చూస్తారని తెలియజేశారు. క్రియా శీలక సభ్యత్వ కార్యక్రమం ఫిబ్రవరి 10 నుంచి 28వ తేదీ వరకు ఉంటుందని, సభ్యత్వం కావలసిన వారు జనసేన పార్టీ ఉరవకొండ ఆఫీసు నందు సంప్రదించాలని, సభ్యత్వ నమోదు కోసం ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజు ఫోటో, నామిని ఆధార్, 500 సభ్యత్వ రుసుము, పర్మినెంట్ ఫోన్ నెంబర్ తో జనసేన పార్టీ ఆఫీసు నందు సంప్రదించగలరని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో వజ్రకరూరు అద్యక్షులు కేశవ్, విదపనకల్ మండల అధ్యక్షులు గోపాల్, బెలుగుప్పా మండల అధ్యక్షుడు సుధీర్, జనసేన నాయకులు రాజేష్, హారిశఒకర్ నాయక్, తిలక్, సురేష్, గోపి, నారాయణ, తిప్పయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-11-at-3.06.51-PM-1024x768.jpeg)