Vizag: పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా జనసేన నాయకులు గవర సోమశేఖర్ రావు ఆధ్వర్యంలో సమావేశం
అక్టోబర్ 31వ తేదీన విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆహ్వానం మేరకు జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావం తెలుపుటకు మరియు భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు విశాఖపట్నం విచ్చేయుచున్న శుభసందర్భంగా వారికి ఘనంగా స్వాగత ఏర్పాట్లు మరియు బహిరంగ సభ విజయవంతం చేయుటకు తేది 25/10/2021న అగనంపూడి కొండయ్యవలస సిడబ్ల్యుసిలో జనసేన నాయకులు శ్రీ గవర సోమశేఖర్ రావు ఆధ్వర్యంలో జివిఎమ్ సి 85వ వార్డు జనసేననాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటుపరం కాకుండా కాపాడగలిగే శక్తి యుక్తి ఉన్న ఏకైక నాయకుడు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ అని వారి పర్యటన విజయవంతం చేయాల్సిందిగా నిర్వాసితులు, ఉక్కు ఉద్యోగులు మరియు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-25-at-10.37.14-PM-1024x763.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-25-at-10.37.14-PM-1-1024x763.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-25-at-10.37.15-PM-1024x763.jpeg)