జనసేన నేతల ఔదార్యం

పలమనేరు నియోజకవర్గం గబ్బిలకోటూరు గ్రామంలో వికలాంగులైన వీరమ్మ, శంకరయ్య, లక్ష్మీనారాయణ పెన్షన్ తీసేసారని ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాను ఆశ్రయించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పడంతో అధికారులతో మాట్లాడి వాళ్లకి పెన్షన్ ఇప్పించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్టేట్ ప్రోగ్రాం కమిటీ జనరల్ సెక్రటరీ భవానీ రవికుమార్ వికలాంగులకు కుటుంబానికి 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. చిత్తూరు జిల్లా రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి 5000 రూపాయలు ఆర్ధిక సహాయం చేసి కుటుంబానికి అండగా ఉంటామని తెలియచేసారు. ఆర్ధిక సహాయాన్ని ఆ కుటుంబానికి అండగా నిలిచి స్థానిక చిత్తూరు జిల్లా యువ నాయకులు సామల సుబ్రమణ్యంరెడ్డి మరియు వారి టీమ్ చేతుల మీదగా వారికి 15 వేల రూపాయలు అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.చిత్తూరు జిల్లాలో వికలాంగుల పట్ల అధికారపార్టీ దౌర్జన్యానికి బలైన వికలాంగులను, అధిష్టానం అదేసానుసారం అర్హులైన వికలాంగులకు తమవంతుగా ఆర్గనైజింగ్ కమిటీ జనరల్ సెక్రెటరీ భవాని రవికుమార్ 10 వేల రూపాయలు మరియు రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి 5 వేల రూపాయల చొప్పున ఆ కుటుంబానికి అండగా నిలిచి స్థానిక చిత్తూరు జిల్లా యువ నాయకులు సామల సుబ్రమణ్యంరెడ్డి మరియు వారి టీమ్ చేతుల మీదగా వారికి 15 వేల రూపాయలు అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.