పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తిరుమల కొండపైకి కాలినడకన పాదయాత్ర

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు గురువారం తిరుమల కొండపైకి మెట్లు మార్గం ద్వారా పాదయాత్ర చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు బాగుపడే విధంగా పరిపాలన అందించాలన్న, అవినీతి లేని పరిపాలన కొనసాగాలన్న ఒక మా అధినేత పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం. మరి జనసేన అధినేత పవన్ కళ్యణ్ పై కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన అధికారంలోకి రావాలని ఆ వైకుంఠ వాసుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… ఆ ఏడుకొండలవాడీ ఆశీస్సులు జనసేన పార్టీకి ఉండాలని తిరుమల కొండపైకి మెట్ల ద్వారా కాలినడకన పాదయాత్ర చేపట్టినట్లు బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. అదేవిధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని, అలాగే వారాహి యాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కోరుకుంటున్నట్లు బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు.