టాలీవుడ్ థియేటర్లలో ఫుల్ సీటింగ్కు అనుమతి ఇవ్వండి..
తెలుగు రాష్ట్రాలలోని సినిమా థియేటర్లలో వంద శాతం సీటింగ్కు అనుమతి ఇవ్వాలని ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ను విడుదల చేసింది. తమిళనాడులో వంద శాతం సీటింగ్కు ఓకే చెబుతూ అక్కడి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని అందులో పేర్కొంది.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణలలో అమలవుతున్న 50 శాతం సీటింగ్తో థియేటర్ల యాజమాన్యాలకు తీవ్ర నష్టాలు వస్తున్నాయని.. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 100 శాతం సీటింగ్కు అనుమతి ఇవ్వాలంటూ నిర్మాతల మండలి కోరుతోంది. కాగా, ఈ సంక్రాంతికి తెలుగులో వరుసపెట్టి బడా సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అభ్యర్ధనకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయన్నది వేచి చూడాలి.