శ్రీకాళహస్తి మార్పు కోసం జనసేనకి ఒక్క అవకాశం ఇవ్వండి!!

  • గ్లాసు గుర్తుకి ఓటు వేయండి!!

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో “జనసేన విజయ యాత్ర- ఎపి నీడ్స్ పవన్ కళ్యాణ్ కార్యక్రమం 71వ రోజులో భాగంగా బుధవారం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఏర్పేడు మండలం, సీతారాం పేట గ్రామంలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినుత కోటా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఆదరించాలని, నియోజకవర్గంలో శ్రీమతి వినుత కోటా గారిని ఆశీర్వదించి, గాజు గ్లాసు గుర్తు కి ఓటు వెయ్యాలని ప్రజలను కోరడం జరిగింది. మార్పు కోసం జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు నితీష్ కుమార్, వెంకట రమణ యాదవ్, నాయకులు గురు ప్రసాద్, జనార్ధన్, మల్లింగుంట చిన్న మునయ్య, వెంకటముని, దుర్గ, జన సైనికులు భాను, రేవంత్, నాని, మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, పేట చంద్ర శేఖర్, తోట గణేష్, రవి కుమార్ రెడ్డి, పేట చిరంజీవి, లక్ష్మి, శారద, సురేష్, జ్యోతి రామ్, గరిక సురేష్, నక్కా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.