రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి

పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి కార్యక్రమంలో భాగంగా సోమవారం గొల్లప్రోలు పట్టణం ఈ బీసీ కాలనీ లో 18, 19, 20 వార్డులలో జరిగింది. ముందుగా స్థానిక కార్యకర్తలు, నాయకులు సహకారంతో శేషుకుమారి ప్రతి గడపగడపకు వెళ్లి ప్రజలతో మమేకమై జనసేన యొక్క ఆశయ సిద్ధాంతాలను వారికి వివరించి వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుకు అమూల్యమైన ఓటును వేసి జనసేన పార్టీని గెలిపించండి అన్నారు. స్థానిక ప్రజలు వారికున్న సమస్యలు, ఇబ్బందులు ఆమెకు వివరించారు. అదే విధంగా ఈసారి ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేస్తామని మీ సమస్యలు అన్ని అలాగే ముఖ్యంగా చేనేత కార్మికులు సమస్యలు పరిష్కరిస్తామని ఆమె తెలియజేశారు. స్థానిక 19వ వార్డులో వైసీపీ కార్యకర్తగా సేవలు అందించిన వీరబాబు ప్రస్తుతం జనసేనలో చేరి వారికున్న సమస్యలు శేషుకుమారికి వివరించారు 19, 20 వార్డు ప్రజలు వైసిపి ఓటు వేసి గెలిపించడం కీలక పోషించిన వీరబాబు నేడు కౌన్సిలర్లను, కమిషనర్, చైర్మన్ లను వార్డులకు రోడ్లు వేయమని ఎంత విన్నవించుకున్నా స్పందించలేదని తర్వాత ఎంపీ సహాయంతో ఒక రోడ్డు పడిందని, మిగతా ప్రాంతాలకు రోడ్డు పడలేదని, ఇటీవల పడిన వర్షాలకు బురదమయం అయిన రోడ్లు గురించి కమిషనర్ కి తెలియజేయడానికి ఫోన్ చేయగా ఆయన లిఫ్ట్ చేసి సరైన సమాధానం ఇవ్వలేదని శేషు కుమారికి వివరించారు. ఈ సమస్యపై ఆమె స్పందిస్తూ పరిష్కార దశగా జనసేన పని చేస్తుందని అతి త్వరలోనే రోడ్డు వేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు టౌన్ ప్రెసిడెంట్ వినుకొండ శిరీష, రూరల్ మహిళా ప్రెసిడెంట్ వినుకొండ అమ్మాజీ,గుండ్ర హరీష్, నారిపిరెడ్డి రాజా, శ్రీరామ్, రాజా, కొర్ల నాగ గని, లింగంశెట్టి వీర వెంకటరమణ, రఘు, శివ, గణేష్, శ్రీకాంత్, నాయకులు, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ లు అమరాది వల్లి రామకృష్ణ, గోపు సురేష్, కంద సోమరాజు, మచ్చ అప్పారావు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.