రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. మాకినీడి శేషుకుమారి

పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి బుధవారం గొల్లప్రోలు పట్టణంలో రాష్ట్ర అభివృద్ధికై ఒక ఛాన్స్ ఇవ్వండి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె జన సైనికులు, వీర మహిళలతో కలిసి మెయిన్ రోడ్డు, ఈ బీసీ కాలనీ నందు ప్రతి గృహాన్ని సందర్శిస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతేగాక వారికి జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు మాకు వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంటుందని, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు అధికంగా ఉన్నాయని, ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి మా సమస్యలు పరిష్కరించుకుంటామని మహిళలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులిచ్చి, ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు టౌన్ ప్రెసిడెంట్ వినుకొండ శిరీష, రూరల్ మహిళా ప్రెసిడెంట్ వినుకొండ అమ్మాజీ, గున్నబత్తుల రాంబాబు, గుండ్ర హరీష్, నారపరెడ్డి రాజా, రెడ్డి శ్రీకాంత్, గణేష్, శ్రీరామ్, మనీ, నాగు, కీర్తి శివప్రసాద్, హరీష్, రాజా, శ్రీరామ్, దుర్గ, చక్రధర్, శివ, కార్తీక్, మణికంఠ, సాయి కోటి, నూకరాజు, లక్ష్మణ్, సారధి, కరెడ్ల సత్తిబాబు, కెలంగి వాసు, వేగిసెట్టి తాతారావు, రెడ్డెం శ్రీకాంత్, మండల ప్రెసిడెంట్ లు అమరాది వల్లి రామకృష్ణ, బుర్రా సూర్య ప్రకాశరావు, గోపు సురేష్, పబ్బినిడి దుర్గాప్రసాద్ , పెదిరెడ్ల భీమేశ్వరరావు, దేశిరెడ్డి సతీష్, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.