కాంగ్రెస్‌కు గుడ్ బై.. ఖుష్బూ

కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతున్న సినీ నటి, ఖుష్బూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఖుష్బూ. ఇటీవలె బీజేపీ తీసుకొచ్చిన కొత్త విద్యాపాలసీని సమర్ధించారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఖుష్బూపై సీరియస్ అయ్యారు.

ఇక అప్పటి నుండి ఆమె పార్టీ మారుతారని వార్తలు వెలువడుతుండగా ఖుష్బూ మాత్రం ఖండించలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఖుష్బూ త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

2014 నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఖుష్బూ గత కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో ఆమె గ్రాఫ్ కూడా అంత బాగాలేదు. దీంతో బీజేపీలో చేరేందుకే ఆమె మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తమిళనాడులో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ, మరో 8 నెలల్లో అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూను బరిలోకి దింపాలని ఆలొచిస్తోంది.