నిరుద్యోగులకు శుభవార్త .. సింగరేణిలో ఉద్యోగాల భర్తీ

సింగరేణి సంస్థలో ఉన్న ఖాళీలన్నింటినీ మరో ఆరు నెలల్లో భర్తీ చేస్తామని సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అన్నారు. గత ఐదేండ్లలో ప్రత్యక్ష, కారుణ్య, అంతర్గత నియామకాల పద్ధతుల్లో 16 వేలకు పైగా ఖాళీ పోస్టులను భర్తీ చేశామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పోస్టుల్లో ఇంటర్నల్‌ కోటా పెంచి అర్హులందరికీ అవకాశం కల్పిస్తామన్నారు. సింగరేణి భవన్‌లో నిన్న 46వ రక్షణ త్రైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చాలా గనుల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్‌ సిబ్బంది, సూపర్‌ వైజర్లు, మెడికల్‌ సిబ్బంది, స్పెషలిస్టు డాక్టర్లు తదితర పోస్టులను వెంటనే భర్తీ చేసి ఉత్పత్తి పెంచాలని ఉద్యోగ సంఘాలు సూచించాయి. దీనిపై స్పందించిన ఆయన సంస్థలో ఖాళీగా ఉద్యోగాలన్నింటినీ ఆరు నెలల్లోగా భర్తీచేస్తామని చెప్పారు. ఖర్చుకు వెనుకాడకుండా కార్మికుల రక్షణ విషయంలో పరికరాల కొనుగోలుకు సింగరేణి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *