దీక్ష చేస్తున్న వి.ఆర్.ఏలకు గోపాలపురం జనసేన సంఘీభావం

మంగళవారం గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో ఎం.ఆర్.ఓ ఆఫీసు దగ్గర వి.ఆర్.ఏలకు జీతాలు పెంచమని రిలే దీక్ష చేస్తున్న ఉద్యోగులకు గోపాలపురం జనసేన పార్టీ తరుపున మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, అచ్చుత సత్యనారాయణ, అవ్వుపాడు సర్పంచ్ & జిల్లా కార్యదర్శి, నల్లజర్ల మండలం అధ్యక్షులు చోడసాని బాపిరాజు, దేవపల్లి మండలం అధ్యక్షులు కాట్నం గణేష్, జనసేన నాయకులు రుద్ర శ్రీను, జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.