మొక్కజొన్న పంట నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలి: తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ నియోజకవర్గం, కోహెడ మండలంలోని తీగలకుంటపల్లి గ్రామానికి చెందిన మూల లక్ష్మారెడ్డి అనే రైతు మొక్కజొన్న పంటలో ప్రమాదశావత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు వచ్చి మూడు ఎకరాల పంట మరియు స్పింక్లర్ పైపులు పూర్తిగా దగ్ధం కావడంతో, దగ్ధమైన పంటను హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. వ్యవసాయం మీదే ఆధారపడిన రైతు ఆర్థిక నష్టపోయినందున ప్రభుత్వం వెంటనే రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన పార్టీ తరపున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్, మండల నాయకులు వేల్పుల మధు, ఆకుబత్తిని రాకేష్, వేల్పుల శ్రీకాంత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.