అంగన్వాడీ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి: జ సిజి రాజశేఖర్

డిమాండ్లన్నీ ఆమోదియోగ్యమైనవి

ప్రతీ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం

సరికొత్త ప్రజా ప్రభుత్వంలో సరైన పరిష్కారం లభిస్తుంది

జనసేన పత్తికొండ నియోజకవర్గ సమన్వయ బాద్యుడు సిజి రాజశేఖర్

పత్తికొండ: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు మూడవ రోజున జనసేన పార్టీ సంఘీభావం తెలియజేసింది. ఈ కార్యక్రమానికి జనసేన నియోజవర్గ సమన్వయ బాధ్యుడు సిజి రాజశేఖర్ హాజరై మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులకు, హెల్పర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. గత ఎన్ని కల ముందు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీని మన రాష్ట్రంలోనూ అమలు చేయాలి. మినీ సెంటర్లన్నిం టినీ మెయిన్ సెంటర్లుగా మార్చాలి, మినీ వర్క ర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ను రూ.5 లక్షలకు పెంచాలి. హెల్పర్ల ప్రమోషన్లలో నిబంధనలు రూపొందించాలి. రాజకీయ జోక్యం అరికట్టాలి. ప్రమోషన్ వయస్సు 50 సంవత్సరా లకి పెంచాలి. సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ కుటుంబంలో ఒక రికి ఉద్యోగం ఇవ్వాలి. రూ.10 లక్షల బీమా అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రిటైర్మెంట్ వయస్సు ఏళ్లకు పెంచాలి. వేత నంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం పెంచాలి. ఆరు నెలల నుంచి పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు, 2017 టీఏ బిల్లులు, ఇతర బకాయిలన్నీ వెంటనే చెల్లించాలి. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. ఎఫ్ ఆర్ఎస్ ను రద్దు చేయాలి. మూడు యాప్లను రద్దు చేసి ఒకే యాప్ ద్వారా విధులు నిర్వహించే విధంగా చేయాలని డిమాండ్ చేసారు. ఈ డిమాండ్ లపై ప్రభుత్వం వెంటనే స్పందించి వాటికీ పరిస్కారం చూపాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేసారు. అంగన్వాడీల ప్రతీ సమస్యను పవన్ కళ్యాణ్ కు తెలియజేసి, ప్రభుత్వం పై ఒత్తిడి చేసి సాధించుకొనేలా, లేదా మరో మూడు నెలలలో జనసేన టిడిపి ప్రజా ప్రభుత్వంలో సముచితమైన నిర్ణయం తీసుకొని, చక్కని పరిష్కారం చూపడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, మాజీ ఎంపీపీ బీటీ గోవిందు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు నరసింహ యాదవ్, శ్రీనివాసులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, ఎర్రి స్వామి, చాంద్ బాషా, వడ్డే వీరేష్, సురేష్, అశోక్ కుమార్, రాముడు, వెంకటేష్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.