కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జనవాణి

  • జనసేన కనపర్తి మనోజ్ కుమార్‌ న్యాయం చేయండి
  • కులం పేరుతో దూషించి, బెదిరింపులకు గురి చేస్తున్నారు

కొండపి నియోజకవర్గం: జనసేన జనవాణి కార్యక్రమంలో పొన్నలూరు దళితులు ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొన్నలూరు మండలంలో దళితులు పాల్గొని వారి సమస్యలు ప్రస్తావించడం జరిగింది. జరుగుమల్లి మండలంలో పైడిపాడు గ్రామం నందు ఉన్న “జే పీ పవర్ వెంచర్స్ ఓపెన్ రీచ్” నందు ఉన్నటువంటి ఇసుక దగ్గర పొన్నలూరు ఎస్. సి కాలనీకి చెందిన కంచర్ల రామకృష్ణ, దార్ల రాజేష్, చుక్కా రామకృష్ణ అనే ముగ్గురు దళితులు సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు, నెల రోజులు వారితో పని చేయించుకుని జీతం ఇవ్వకుండా, భోజనాలు పెట్టకుండా, పగలు మరియు రాత్రి డ్యూటీ చేయించుకుని, క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు 10వ తరగతి పాస్ అయినట్టు సర్టిఫికెట్ కూడా తీసుకొని రండి అంటూ శ్రీనివాసులు మరియు కాశి అనే ఇద్దరు వ్యక్తులు ఆంక్షలు విధిస్తున్నారు. నెల రోజులు పాటు ముగ్గురితో పని చేయించుకున్నారు. జీతం ఇవ్వండి అని దళితులు అడగగా, మీ దిక్కున చోట చెప్పుకోండి అంటు కులం పేరుతో దూషించి, శ్రీనివాసులు మరియు కాశి అనే ఇద్దరు వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దళితులు ముగ్గురికి నెల జీతం ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది, వారి ముగ్గురికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. తొందరలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇవ్వడం జరుగుతుంది, న్యాయం జరిగేంతవరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. ఈ కార్యక్రమంలో దళితులకు అండగా మెండ భానుచందర్ మండల కార్యదర్శి నవీన్ కుమార్, నందకిషోర్, పవన్ కళ్యాణ్ , మౌనతేజ మరియు జనసైనికులు పాల్గొన్నారు.