ఘనంగా రెడ్డి రాములమ్మ వర్ధంతి కార్యక్రమం

ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు మాతృమూర్తి కీ.శే.స్వర్గీయ రెడ్డి రాములమ్మ వర్ధంతి సందర్భంగా మంగళవారం వెంకటాపురంలోని ఎమ్.ఆర్.ఆర్.కాలనీలో ఉన్న రవితేజ చిల్డ్రెన్ హోమ్ లో, అనాధ ఆశ్రమాల్లో, అంధుల ఆశ్రమాల్లో అల్పాహారం మరియు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కీర్తిశేషులైన స్వర్గీయ రెడ్డి రాములమ్మ జ్ఞాపకార్థం నిమిత్తం ప్రతి సంవత్సరం వారి కుమారుడు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు వారి శ్రీమతి రెడ్డి అనురాధ నాయుడు చేతుల మీదగా అంధత్వం కలిగిన వారికి మరియు వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అల్పాహార, భోజన కార్యక్రమాలు జరిపించి వారందరికీ స్వీట్స్ పళ్ళు ఫలహారాలు పంచిపెట్టారు. వృద్ధాశ్రమంలో వృద్ధుల నిమిత్తం వారి ఆరోగ్యం పట్ల, వారి సౌకర్యాల పట్ల వివరములు తెలుసుకొని వారికి కావలసినవి అందజేశారు. రెడ్డి అప్పలనాయుడు వారి శ్రీమతి రెడ్డి అనురాధ నాయుడు ఇదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా అంధులకు, వృద్ధులకు, పేదవారికి, చేయూతను అందిస్తూ.. తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రెడ్డి అప్పలనాయుడు వారి శ్రీమతి రెడ్డి అనురాధ నాయుడు లను వారి కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు.