పితాని ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

  • రైతులను దుస్సాలువతో ఘనంగా సత్కరించిన పితాని

ముమ్మిడివరం: జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం, మొక్కల తిప్ప గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పంట పొలాల మధ్యలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారలకమిటి సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ హాజరై జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా రైతులను దుస్సాలువతో ఘనంగా సత్కరించి, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేసి, వారి సమస్యలు అడిగి తెలుసుకుని రైతులకు ఎల్లప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజెసారు. మొక్కలతిప్ప గ్రామంలో సుమారు 1000 ఎకరాలు ముంపుకు గురికాకుండా అవుట్ ఫాల్ స్లుఇజ్ వెంటనే బాగుచేయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ రైతుల పక్షపాతిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఒక అవకాశం ఇవ్వాలని పితాని బాలకృష్ణ రైతుల విజ్ఞప్తి చేసారు.