కోరుకొండ జనసేన కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

రాజానగరం: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కోరుకొండ కార్యాలయం ప్రాంగణంలో ఉదయం పండితుల వేద మంత్రాలతో అత్యంత శాస్త్రోక్తంగా ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉగాది పచ్చడి, పలు రకాల స్వీట్స్ ను కార్యక్రమానికి వచ్చిన అతిధులకు, పార్టీ నేతలు, జనసైనికులకు కార్యకర్తలకు, అభిమానులకు రుచి చూపించారు. తెలుగు నూతన సంవత్సర సందర్భంగా రాజానగరం నియోజక వర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానులు, జనసేన నాయకులు, జనసైనికులకు కార్యకర్తలకు బత్తుల దంపతులు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ… అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాబోవు రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించామన్నారు.