గ్రావెల్‌ అక్రమ రవాణా అరికట్టాలి: జనసేన డిమాండ్

సర్వేపల్లి: నియోజకవర్గంలోని అక్రమ గ్రావెల్ రవాణా అరికట్టాలంటూ సర్వేపల్లి జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సహజ వనరులే కేంద్రంగా.. అధికారమే అనుమతులుగా.. అక్రమార్జునే లక్ష్యంగా ప్రకృతి వైపరీత్యాలను, ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా.. మట్టి, ఇసుక, గ్రావెల్ తవ్వి ఈ వైసీపీ నాయకులు అడ్డువచ్చిన పేదలపై, పార్టీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించే పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది కోవూరు, సర్వేపల్లి, గూడూరు అన్ని వైసిపి నాయకులు కూడా ఇదే పనిలో ఉన్నారు. ఎన్నిసార్లు మైనింగ్ అధికారులకు గానీ, కలెక్టర్ కార్యాలయంలో గాని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అదను చూసుకొని రాత్రులు అక్రమ రవాణా జరుగుతుంది. జనసేన పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గంలోని ఇసుక ట్రావెల్ సిలికాన్ అక్రమ రవాణాను అరికట్టేందుకు, నిలదీసేందుకు జనసైనికులు రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు మేలుకొని అక్రమ తవ్వకాలకు స్వస్తి చెబితే బాగుంటుంది. నాలుగు సంవత్సరాలలో 40 సంవత్సరాలు సరిపడా అక్రమ సంపాదన మూట కట్టుకున్నారు. ప్రజా ప్రభుత్వం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన అక్రమాలు అన్నిటికి సమాధానం చెబుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సర్వేపల్లి నాయకుడు బొబ్బేపల్లి సురేష్, జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, రవికుమార్, కార్య దర్శి ప్రశాంత్ గౌడ్, రాజా, ఖలీల్, ప్రసన్న, మౌనిష్, హేమంత్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.