డా.ఘంటసాల వెంకటలక్ష్మికి ఘన సన్మానం

దెందులూరు: “కొల్లేరు ప్రజా వేదిక” కన్వీనర్, మానవతావాది, ప్రముఖ సాహితీవేత్త చింతపల్లి వెంకటనారాయణ ఆధ్వర్యంలో కైకలూరులో జరిగిన కొల్లేరు ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం, కొల్లేరు ప్రాంత ప్రజల మహా నాయకుడు కీ.శే శ్రీ సైదు గంగరాజు శత జయంతి ఉత్సవాల సందర్భంగా కొల్లేరు ప్రాంతం నుంచి గౌరవ డాక్టరేట్ పొందినందుకు, కొల్లేరు ప్రజల పక్షాన వారి సమస్యలపై పోరాటం చేస్తున్నందుకు బహుజన ఉద్యమకారిణి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.ఘంటసాల వెంకటలక్ష్మిని స్థానిక నియోజకవర్గ ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రి వర్యులు ఘనంగా సన్మానించారు.