Kothapeta: అమరావతి రైతులకు అభినందనలు – బండారు శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, ప్రముఖ సీనియర్ నాయకులు శ్రీ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీలో అమరావతి రాజధానిపై జరిగిన పరిణామాలు, అమరావతి రైతులకే కాకుండా, యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు, జనసైనికులకు, బిజెపి శ్రేణులకు, ఎంతో సంతోషాన్ని సంతృప్తినిచ్చిందని, ఈ గెలుపు అమరావతి రైతులు- బిజెపి- జనసేన-ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అన్ని వర్గాలు, అన్ని పార్టీల ఐకమత్య గెలుపుగా భావిస్తున్నామని, ప్రభుత్వం వెనక్కి తగ్గడం, అమరావతి రైతులు 700 రోజులు నిరాహార దీక్ష త్యాగం, అమరావతి రైతులు పడ్డ కష్టం మరువలేనిదని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలంతా ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని, నీతివంతమైన నాయకుడు పాలన కావాలంటే, రాబోయే రోజుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వాలని, జనసేనానే, ఈ రాష్ట్రానికి ఆశాజ్యోతి, ఈ రాష్ట్రానికి వెలుగునిచ్చే ఆశాదీపం అని, ఆంధ్రరాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి కాపాడి గలిగేది, ధరలను అదుపులో ఉంచి పేదలు మధ్యతరగతి వారు సంతోషంగా బ్రతకగలిగే పాలన కావాలంటే, ఒక జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రమే ఇవ్వగలరని, ఈ సందర్భంగా జనసేనానిని కొత్తపేట నియోజక వర్గం జనసేన ఇంచార్జి బండారు శ్రీనివాస్ కొనియాడారు. అంతేకాకుండా అమరావతి రైతులకు అభినందనలు తెలియజేశారు. అలాగే బిజెపి శ్రేణులకు, అమరావతి రాజధాని కావాలన్న ప్రతి ఒక్క పార్టీకి, నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.