రోడ్డు ప్రమాద బాధితులకు గుడివాక శేషుబాబు పరామర్శ
అవనిగడ్డ : నాగాయలంక మండలం, దిండి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు వరి కోతలు పనుల నిమిత్తం కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామానికి ఆటోలో వెళ్తుండగా మాచవరం గ్రామం వద్ద ఆగి ఉన్న ఆటో ను రొయ్య పిల్ల తీసుకు వెళ్ళే వ్యాన్ ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద బాధితులను అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు అవనిగడ్డ ఏరియా ఆస్పత్రిలో పరామర్శించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-15-at-1.13.33-PM-1024x768.jpeg)