నెల్లటూరు ప్రగతినగర్ లో వీధిలైట్ల సమస్యను పరిష్కరించిన గూడూరు జనసేన

గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నెల్లటూరు ప్రగతినగర్ లో వరదల ప్రభావంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ గురువారం ఆ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఇళ్ల చుట్టూ బురద ఉండడంతో పాటు కనీసం వీధిలైట్లు లేక పాములతో ఇబ్బంది పడుతున్నామని చిన్న పిల్లలు ఉన్నారని స్థానికులు తెలియచేయడంతో స్పందించిన జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తో ఫోన్లో మాట్లాడడంతో స్పందించిన కమిషనర్ సచివాలయ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అదేశాలిచ్చారు.

వరద బాధిత కుటుంబానికి జనసేన నిత్యావసర సరుకులు 5 వేలు ఆర్థిక సాయం…

నెల్లటూరు ప్రగతినగర్ లోని చికవోలు వెంకట రమణమ్మ వరదల ప్రభావంతో ఇబ్బంది పడుతుండడంతో ఆమె కుటుంబానికి నిత్యవసర సరుకులు, దుస్తులు, ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఓంకార్, సాయి, మోహన్, శివ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.