గల్ఫ్ జనసేన యూఏఈ కార్యవర్గ భేటి
- గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ కేసరి త్రిమూర్తులు చంద్రశేఖర్ మొగళ్ల్ల అధ్యక్షతన గల్ఫ్ జనసేన యూఏఈ కార్యవర్గ భేటి
యూఏఈ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గల్ఫ్ కార్యవర్గం ఏర్పాటు చేసినతరువాత మొదటి సారిగా కార్యనిర్వాహక సభ్యుల సమావేశం శనివారం గల్ఫ్ జనసేన పార్టీ కార్యాలయం అజ్మన్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూఏఈ నుండి గల్ఫ్ జాతీయ కన్వీనర్లగా పవన్ కళ్యాణ్ గారిచే నియమిపబడిన కేసరి త్రిమూర్తులు చంద్రశేఖర్ మొగళ్ల్ల ని మరియు ప్రాంతీయ కన్వీనర్ల ని యూఏఈ కార్యవర్గం ఘనంగా సన్మానించి అభినందించారు. అలాగే 2024 ఎలక్షన్ లో ధేయంగా ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని సహాయ కార్యక్రమాలు చెయ్యాలని కార్యవర్గం తీర్మానం చేసింది. అలాగే పార్టీ మరింత బలోపేతం కోసం గల్ఫ్ నుండి చేయవలసిన కార్యక్రమాలు కార్యవర్గం సమావేశంలో చర్చించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-30-at-9.24.33-PM-1024x331.jpeg)