జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జనసేన పార్టీ నాయకులు

జగద్గిరిగుట్ట డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు వడ్లకొండ జీవన్ ఆహ్వానం మేరకు శ్రీ లక్ష్మీ వేంకటేస్వర స్వామి వారి 51వ బ్రహ్మోత్సవాలలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్ మరియు హైదరాబాద్ కమిటీ సెక్రెటరీ నందగిరి సతీష్ కుమార్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గుడి చుట్టుపక్కల పరిసరాలను మరియు శిథిలావస్థకు చేరిన నవగ్రహ మండపాన్ని పరిశీలించి మాట్లాడుతూ, అధికారులు దేవాదాయ శాఖ తగు చర్యలు తీసుకుని ఈ దేవాలయాన్ని పుణ్యక్షేత్రంగా ఆధునీకరించి, ఒక గొప్ప పర్యటన ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్, మహేష్, లక్ష్మీ, సాగర్, విజయ్, రఘు, ప్రతాప్, శశి, రవి, సంతోష్, గణేష్, నాగరాజు, సాయి, తదితరులు పాల్గొన్నారు.