నందికొట్కూరులో గుంతల ఆంధ్ర ప్రదేశ్ కు దారేది కార్యక్రమం

నందికొట్కూరు నియోజకవర్గం: జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి గుంతల ఆంధ్ర ప్రదేశ్ కి దారేది అనే కార్యక్రమంలో బాగంగా శనివారం రోడ్ల దుస్థితిపై నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఆందోళన కార్యక్రమం విజయవంతంగా చేపట్టడం జరిగింది. బస్సులు లోపలికి వెళ్లే మార్గంలో పెద్దపెద్ద గుంతలు ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం వస్తే ఆ గుంతల్లో నీళ్లు ఆగడంతో వాహనాలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి మరియు మోటార్ బైకు వాహనాలు వెళ్లాలంటే ప్రమాదాలు చాలా జరుగుతుండడంతో దీన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా బాధాకరం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రోడ్ల గురించి కామెంట్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి వినపడట్లేదా అని ప్రశ్నించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నుండి నియోజకవర్గ నాయకులు నల్లమల రవికుమార్, మధు, బాలరాజు, అలీ, వెంకట్, శేఖర్ సతీష్, సూరీ, పుష్ప రాజ్, నాగరాజు, సురేష్, తెలుగుదేశం పార్టీ నుండి నాయకులు జయసూర్య, మహేశ్వరరెడ్డి, నాగముని, జాకీర్, ముర్తుజావాలి, షకీల్ అహమ్మద్, శ్రీను, వాసురెడ్డి, వేణు, రహిమాన్ మల్లికార్జునరెడ్డి, రాజు, కృష్ణారెడ్డి, జయన్న, రాజన్న, బాబుల్, ఏసేపు, ప్రవీణ్, మరియు తదితరులు పాల్గొన్నారు.