వంగవీటి రంగాకి నివాళులర్పించిన గుంటూరు జనసేన

గుంటూరు, ఏటుకూరు గ్రామంలో స్వర్గీయ వంగవీటి మెహన రంగా 33వ వర్థంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా గుంటూరు జిల్లా జనసేన పార్టి ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. పేద ప్రజల కోరకు నిరంతరం శ్రమించి తన సేవలను అందించాలన్నారు స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మిదుర్గ మాట్లాడుతూ కార్పొరేటర్ గాను, శాసనసభ్యునిగాను ప్రజలకు చేరువయ్యే విధంగాను ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగిఇందని ఆమె అన్నారు. ప్రజలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసారు. అనంతరం గ్రామ ప్రజలకు అన్నదానం కార్యక్రమ చేసినారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చింతా రేణుకా రాజు, విష్ణుమెలకల ఆంజినేయలు, దాసరి వాసు, పావులూరి కోటేశ్వరరావు, ఆకుల వీరరాఘవయ్య, దాది ఆంజనేయలు తదితరులు పాల్గొన్నారు.