కోవూరులో టిడిపి రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన గునుకుల

కోవూరు నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనగా గురువారం కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ దినేష్ రెడ్డి చేస్తున్న రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా కిషోర్ మాట్లాడుతూ.. జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసింది సొంత ప్రయోజనాలకు కాదు. రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించాలని ప్రజల ఇబ్బందుల నుండి కాపాడటానికి, రాష్ట్రంలో అరాచకాలను ఎండగట్టడానికే. నేడు పవన్ కళ్యాణ్ గారు క్లిష్ట పరిస్థితిలో తీసుకున్న ఈ నిర్ణయానికి జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనుభవజ్నుల అనుభవాన్ని జనసేన పార్టీ యువత తెగింపుని ముందుకు తీసుకెళ్లి ప్రజా ప్రభుత్వానికి స్థాపించేందుకు కష్టపడి పనిచేసి కోవూరులో జరుగుతున్న అరాచకాలు అంతమొందిస్తామని తెలిపారు.