ప్రసాద్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన గురుదత్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన పోకల జాన్ ప్రసాద్ ఆదివారం రాత్రి పొడ పాము కాటుకు గురై రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ప్రసాద్ గురించి ఆరోగ్య విషయాలు డాక్టర్ ని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరడంతో పాటూ మీకు అన్ని విధాలుగా జనసేన పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం సీనియర్ నాయకులు అత్తిలి శ్రీరామ్ చంద్రమూర్తి, అత్తిలి ప్రసాద్, తన్నీరు పాండవులు, పోకల పెద్దకాపు, జనసేన పార్టీ నాయకులు తన్నీరు తాతాజీ తదితరులు పాల్గొన్నారు.