పలు కుటుంబాలను పరామర్శించిన గురుదత్

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలంలో పలు కుటుంబాలను జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహిత మేడ గురుదత్ ప్రసాద్ శనివారం పరామర్శించారు. కార్యక్రమంలో రాజానగరం మండలం, రాజానగరం గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చ శివనాగు గత కొన్ని రోజుల క్రితం బైక్ ఆక్సిడెంట్ లో గాయపడ్డారు. శివను రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహిత మేడ గురుదత్ ప్రసాద్ పరామర్శించి, జనసేన పార్టీ ప్రమాద భీమా నమోదు చేయించారు. అనంతరం రాజానగరం మండలం, ఫరిజల్లిపేట గ్రామ జనసేన పార్టీ ఎంపీటీసీ ఆపరేషన్ చేయించుకున్నారని విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ వారిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు సోను (జమాల్), రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, సూర్యారావుపేట జనసేన పార్టీ ఎంపీటీసీ డబ్బు (రమణ, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఐటి-కో ఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, రాజానగరం మండలం జనసేన పార్టీ కో-కన్వీనర్ నగవరుపు భాను శంకర్, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ వీరమహిళలు కామిశెట్టి హిమ శ్రీ, కందికట్ల అరుణ, జనసేన పార్టీ వార్డ్ మెంబెర్ కాళ్ళ శేషు, రాజానగరం మండలం జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ పుత్సల సాయి, మన్య శ్రీను, మన్య నాగు, రాజానగరం మండలం యూత్ ఐకాన్ పల్లా హేమంత్, చదువు ముక్తేశ్వరరావు , తన్నీరు తాతాజీ, తోట శివ, గబ్బర్, చల్లా ప్రసాద్, వల్లేపల్లి రాజేష్, పెద్దకాపు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.