జనసేన ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలి: కాంతారావు

మైలవరం, రెడ్డిగూడెం మండల జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చాపలమడుగు కాంతారావు మాట్లాడుతూ గురువారం నాడు కొండపల్లిలో మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహనరావు(గాంధీ) ఆధ్వర్యంలో జరిగే జనసేనపార్టీ ఆత్మీయ సమావేశానికి జనసేన పార్టీ మండల కార్యవర్గ సభ్యులు, గ్రామ పార్టీ కార్యవర్గ సభ్యులు, గ్రామాల అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జనసేన పార్టీ, బీజేపీలు బలపరిచిన తెలుగుదేశంపార్టీ ఉమ్మడి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివానద్(చిన్ని) మరియు మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ విచ్చేయుచున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు పాములపాటి సుందరరామిరెడ్డి, మండల నాయకులు తోట క్రాంతిబాబు, కొండపల్లి మణికంఠ, రామకృష్ణ, కళ్యాణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.