ఘనంగా రెడ్డి అప్పలనాయుడు జన్మదిన వేడుకలు

ఏలూరు: జనసేన పార్టీ ఉభయ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు 53వ పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రెడ్డి అప్పలనాయుడు పుట్టినరోజు వేడుకలకు నియోజవర్గం నుంచి వేలాది మంది తరలి వచ్చారు. పవర్ పేట స్టేషన్ రోడ్ లోని జనసేన కార్యాలయం ఎదురుగా ఉన్న కళ్యాణమండలంలో జరిగిన రెడ్డి అప్పలనాయుడు జన్మదినోత్సవ వేడుకలకు కుల, మత, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు విచ్చేసి రెడ్డి అప్పలనాయుడుకు బొకేలు అందించి, పూల మాలలు వేసి, శాలువాలు తప్పి, ఆయన చేత కేక్ లు కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి రెడ్డి అప్పలనాయుడు ప్రతి ఒక్కరిని తనవాడిగా భావించి ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆదుకునే మనస్తత్వం ఉండడంతో నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన్ను సొంత మనిషిగా భావిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పుట్టినరోజు వేడుకలు మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్విరామంగా కొనసాగాయి. తన మన అనే బేధం లేని మంచి మనిషి రెడ్డి అప్పలనాయుడు అంటే అందరికీ అభిమాన పాత్రుడు. నాయుడు పుట్టినరోజు వేడుకలకు తరలివచ్చిన ప్రజలతో పవర్ పేట స్టేషన్ రోడ్డు, పరిసర ప్రాంతాలు కిటకిటలాడయ్యా. పుట్టినరోజు వేడుకలకు విచ్చేసిన వేలాదిమందికి రెడ్డి అప్పలనాయుడు విందు భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు రెడ్డి అప్పల నాయుడు గారి శ్రేయౌభిలాషులు పార్టీలకు అతీతంగా వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు.