ఘనంగా ఈస్టర్ వేడుకలు

మైలవరం, కొండపల్లిలో ఈస్టర్ సందర్బంగా శాంతిని కోరుకుంటూ ఆర్.సి.ఎం చర్చి నందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు అక్కల రామమోహన రావు (గాంధి) పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ త్యాగానికి ప్రతిరూపం అయిన ఈస్టర్ సందర్బంగా మానవాళి కోసం యేసు క్రీస్తు చేసిన త్యాగాలను ప్రబోధించిన శాంతి బోధనలను గుర్తు చేసుకోవాలని అందరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేశారు.