కార్మిక లోకానికి మే డే శుభాకాంక్షలు

శ్రమ శక్తిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. చెమట చుక్కలు చిందించి శ్రామిక లోకం చేసే కష్టం.. ఆర్థిక పురోగతికి ఇంధనంలాంటిది. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశాభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యాన్ని కలిగిన కార్మిక లోకానికి నా తరఫున, జనసేన పార్టీ పక్షాన మే డే శుభాకాంక్షలు తెలియచేస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘటిత రంగంలోని కార్మికులు తమ బాధలు వెల్లడించుకొనేందుకు వేదికలు ఉన్నా వారి సమస్యలు ఎన్నో అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. అసంఘటిత రంగంలోని కార్మికుల సమస్యలు అనేకం నా దృష్టికి వచ్చాయి. కష్ట జీవుల పక్షాన ఎల్లవేళలా జనసేన నిలబడుతుందని జనసేనాని స్పష్టం చేశారు.