నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్

తెలంగాణ సిఎం కెసిఆర్ తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, కొత్త ఏడాదిలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది కరోనా వంటి అనేక సవాళ్లు ఎదురయ్యాయని, వాటిని 2021లో అధిగమిస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొత్త ఏడాదిలో కరోనా పూర్తిగా సమసిపోవాలని ఆయన దేవుడిని ప్రార్థించారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని, కొత్త ఏడాదిలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి పునరంకితం అవుతామని ఆయన స్పష్టం చేశారు. శాంతి,సహనాలతో ముందుకు సాగి తెలంగాణ అభివృద్ధికి ప్రతిఒక్కరు సహకరించాలని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *