జనసేనానికి హాట్సాఫ్! బండారు శ్రీనివాస్

  • అన్నం పెట్టే రైతును ఎప్పటికీ కన్నీరు పెట్టించకూడదు జనసేనాని!
  • చనిపోయిన 80 మంది కౌలు రైతులకు లక్ష రూపాయలు చొప్పున కొంత ఆర్థిక సహాయంగా అందించబోతున్న, జనసేన అధినేత.

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ వారు, కష్టాల్లో ఉండి అప్పులపాలై, ఆత్మహత్య చేసుకొని చనిపోయిన కౌలు రైతులు సుమారు 80 మంది రైతులకు ఒక్కొక్కరికి చిన్న సాయంగా లక్ష రూపాయల చొప్పున ఉడతా భక్తిగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించడం, ఈసాయం వారు వచ్చి, వారి చేతుల మీదగా చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను కలిసి, ఆ కుటుంబాలకు అండగా నిలబడి పరామర్శించడం జరగబోతున్న కారణంగా జనసేనానికి, మా హృదయపూర్వకంగా సెల్యూట్ తెలియజేయుచున్నామనీ బండారు శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలియజేశారు. అధికారం ఉన్నా లేకపోయినా! ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండే గొప్ప మంచి మనసున్న నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ మాత్రమేనని, వారికి ఎవరు సాటిరాలేరని, తాను సంపాదించిన కష్టార్జితం లో సింహ భాగాన్ని పేదలకు, ఆపదలో ఉన్న వారికి పంచి, తన మంచి హృదయాన్ని, పదిమందికి తెలిసేవిధంగా, ఒక గొప్ప మనసున్న నాయకుడు గా పది కాలాల పాటు చల్లగా వర్ధిల్లాలనీ, హాట్సాఫ్ తెలియజేయచున్నాం. ఈ ఉగాది సందర్భంగా పవన్ కళ్యాణ్ వారికి దేవదేవతలు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇవ్వాలని, ఇలాంటి నాయకుడు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా పాలన అందించాలనీ, ఈ రాష్ట్రానికి దశ దిశను మార్చాలని, వెనుకబడిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కావాలని కోరుతున్నాను. ముందు, ముందు ప్రజా సేవకుడుగా రాష్ట్ర చరిత్రలో నిలబడే రోజు ఒకటి వస్తుందని, జనసేనానిని అందరివాడుగా ప్రజలు ఆరాధిస్తారన్న నమ్మకం నిజం కాబోతుందని, బండారు శ్రీనివాస్ జనసేన నేత ప్రెస్ కు తెలియజేశారు.