పల్లె ప్రజల ఆరోగ్య ప్రదాతలు పీఎంపీలు: బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం: పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పీఎంపీలు ఆత్మీయ సమావేశంలో బొలిశెట్టి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందేందుకు ఇబ్బంది పడే పేదలకు ఆరోగ్య ప్రదాతలు పీఎంపీలు అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ముదునూరుపాడు పీఎంపీలు అసోసియేషన్ భవనంలో గురువారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పీఎంపీల సేవలను కొనియాడారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదలందరికీ పిఎంపీలు వారికి తాను ఇప్పుడు అండగా ఉంటానని పేర్కొన్నారు. తనకు పిఎంపిలంతా మద్దతు ప్రకటించాలని, తాను మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు అందరికీ అందుబాటులో ఉన్న సందర్భాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా పి.ఎం.పి సంఘ నాయకులు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.