వరద బాధితులకు చేయూతనివ్వండి

* జనసేన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు నాగబాబు పిలుపు
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సూచనలకు అనుగుణంగా జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మెగా అభిమానులు అవకాశం ఉన్నంత మేరకు వరద బాధితులకు సహాయం చెయ్యాలని జనసేన పార్టీ పి.ఎ.సి. సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు పిలుపునిచ్చారు. ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ బాధ్యులు, నాయకులు తమకు అవకాశం ఉన్నంత మేరకు వరద బాధితులకు సహాయం అందించాలని కోరారు. గోదావరి తీర ప్రాంతాల్లో గ్రామాలు నీట మునిగిన నేపథ్యంలో అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు వెళ్ళిన ప్రజలు ఆహారం, మంచి నీరు, దుస్తులు ఇతర కనీస అవసరాలు లభించక ఇబ్బందులకు గురవుతున్నారు. అందుబాటులో ఉన్న జనసేన శ్రేణులు వరద బాధితులకు అవసరమైనవి సమకూర్చాలని సూచించారు.