మంగళగిరి ప్రధాన కార్యాలయానికి బయలుదేరిన వీరమహిళలు

అనంతపురం జిల్లా, జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యులు శ్రీమతి పెండ్యాల శ్రీలత మరియు పసుపులేటి పద్మావతి ల ఆధ్వర్యంలో రేపు జనసేన పార్టీ మంగళగిరి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు అనంతపురం జిల్లా నుంచి జిల్లా మహిళా సంయుక్త కార్యదర్శులు మరియు అనంతపురం జిల్లాలోని 14 నియోజక వర్గాల నుంచి దాదాపు 40 మంది వీరమహిళలు అనంతపురం నగరంలోని పెండ్యాల శ్రీలత స్వగృహం నుంచి బయలుదేరడం జరిగింది.