రాప్తాడులో జనసేన ఆత్మీయ సమావేశం

రాప్తాడు, నియోజకవర్గంలోని పామురాయి కళ్యాణ మండపంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని మండల అధ్యక్షులు గంట రామాంజి, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యక్రమాల కార్యదర్శి భవానీ రవికుమార్, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు టి.సి.వరుణ్ మాట్లాడుతూ కార్యకర్తల శ్రేయస్సు కొరకే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లోతుగా ఆలోచించి 500 రూపాయలతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలు ఇబ్బందులు పడకూడదని దూరదృష్టితో ఇన్సూరెన్స్ తో కూడిన సభ్యత్వ నమోదు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని సీఎం గా చేయాలన్నదే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ధ్యేయంగా పని చేయాలన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి చూపిస్తామన్నారు. అలాగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు మార్చి 14న పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, కార్యదర్శులు సంజీవ రాయుడు, రాపాధనుంజయ్, కిరణ్ కుమార్, నారాయణ స్వామి (కోడిమీ) మండల అధ్యక్షులు, వీరమహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.