హైకోర్టు తీర్పు అమరావతి రైతుల విజయం

పెడన, మూడు రాజధానులు అంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అమరావతి రైతులను నడిరోడ్డు మీదకు తెచ్చిన వైసీపీ ప్రభుత్వం కోర్టు తీర్పుతో నైనా మొండివైఖరి మారాలి. అమరావతి అభివృద్ధి చేయాలి. రైతులకు న్యాయం చేయాలి. జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల అమరావతి రైతులు గత రెండు సంవత్సరాలుగా ఆందోళన బాట పట్టి, అనేక ఉద్యమాలు చేశారు. రైతులు చేస్తున్న న్యాయబద్ధమైన దీక్షను వక్రీకరిస్తూ ఈ వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు వారి దీక్షలను అపహాస్యం చేస్తూ ఉద్యమస్ఫూర్తిని వక్రీకరిస్తూ దిగజారుడు మాటలు మాట్లాడారు. ఒకానొక దశలో రైతులను పేయిడ్ ఆర్టిస్టులు అంటూ అమరావతి ఉద్యమం పై విషం కక్కారు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పారు. ఆంధ్రుల రాజధాని అమరావతె అని. హైకోర్టు తీర్పును జనసేన పార్టీ స్వాగతిస్తుంది. ఇప్పటికైనా వైసిపి ప్రభుత్వం అమరావతి పై తన మొండి వైఖరి విడనాడాలి. జగన్ రెడ్డి కుల వైషమ్యాలకు స్వస్తి పలకాలి. అమరావతి రైతులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట అన్నారు.