ఘనంగా గోరంట్ల జనసేన నాయకుని సన్మానం

ఉమ్మడి అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఇటీవలే ఎన్నికైన గోరంట్ల కి చెందిన ఎముకలగుట్టపల్లి వెంకటేష్ కి బుధవారం గోరంట్లలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అబు. జిల్లా కార్యదర్శి సురేష్ పెనుగొండ కుమార్ అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి వెంకటేష్ గోరంట్ల లో ఎంతో కష్టపడ్డాడు అతనికి జిల్లా కమిటీలో చోటు కలిపించడం చాలా సంతోషకరమైన విషయం. జనసేన పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి స్థానం, పదవులు వస్తాయి అని చెప్పారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ కచ్చితంగా అధికారం చేపడుతుంది అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమాల కమిటీ సభ్యులు పొగతోట వెంకటేష్. ఐటీ పెనుకొండ నియోజకవర్గ కో ఆర్డినేటర్ యోగనంద రెడ్డి. నియోజకవర్గ నాయకుడు కుమార్ పెనుకొండ మండల కన్వీనర్ మహేష్ సోమందేపల్లి మండల కన్వీనర్ జెబివుళ్ళ, పుట్టపర్తి నాయకులు డాక్టర్ తిరుపతేంద్ర. గోరంట్ల నాయకులు సంతోష్, వీర మహిళ కావేరి, రాఘవేంద్ర నాగేంద్ర, మల్లికార్జున, నరేష్, పురుషోత్తం, గంగరాజు, నాగేష్, తిరుపాల్, నరేంద్ర, కాలనీ శ్రీనివాసులు, శంకర, బాబావలి, మూర్తి, రవి తదితరులు పాల్గొన్నారు.