గుర్రపు చెరువుని బాగు చేయించి, చుట్టూ ఫెన్సింగ్ ని ఏర్పాటు చేయాలి: జనసేన వినతి పత్రం
అవనిగడ్డ నియోజకవర్గం: అవనిగడ్డ లోని ప్రధాన మంచినీటిచెరువు అయిన గుర్రపు చెరువుని వెంటనే బాగు చేయించి, చెరువు చుట్టూ నూతన ఫెన్సింగ్ ని ఏర్పాటు చేయాలని, చెరువులో ఉన్న పిచ్చి మొక్కలను వ్యర్థ పదార్థాలని, చుట్టూ గట్టు మీద ఉన్న పిచ్చి మొక్కలను క్లీన్ చేయించి, ఈ మంచినీళ్లచెరువుని పరిశుభ్రపరచాలని సోమవారం అవనిగడ్డ టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు రాజనాల వీరబాబు ఆధ్వర్యంలో అవనిగడ్డ జనసేన పార్టీ టౌన్ కమిటీ సభ్యులు పంచాయతీ కార్యాలయంలో అర్జీ పత్రం ఇవ్వడం జరిగింది. వీలైనంత త్వరగా ఈ మంచినీళ్ల చెరువుని బాగు చేయించాలనీ, ఫెన్సింగ్ వేసి ప్రమాదాలను నివారించాలని, లేనిపక్షంలో జనసేన పార్టీ తరఫున ప్రజా ఉద్యమం చేస్తాము అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు రాజనాల వీరబాబు, అవనిగడ్డ టౌన్ జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలు భోగాది రాజ్యలక్ష్మి, అవనిగడ్డ టౌన్ పార్టీ ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందు బాబు, అవనిగడ్డ టౌన్ పార్టీ ఉపాధ్యక్షులు గుగులోతు కిరణ్ నాయక్, అవనిగడ్డ టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్నపురెడ్డి ఏసుబాబు, అవనిగడ్డ టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఫరీద్ బాబా, అద్దంకి ధనుంజయ, కార్యదర్శి తోట ప్రసాద్, నెరసు అశోక్, కే లక్ష్మీ, అగే అవనిగడ్డ జనసేన పార్టీ సీనియర్ నాయకులు మత్తి సుబ్రమణ్యం తదితర జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-05-at-8.07.36-PM-1024x461.jpeg)