దసరా తర్వాతే హుజురాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నిక!

తెలంగాణలోని హుజురాబాద్‌ ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. దసరా తర్వాతే హుజురాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పండుగలన్నీ ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని, దీంతో అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఎపిలోని బద్వేల్‌ ఉప ఎన్నిక కూడా దసరా తర్వాతే ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉప ఎన్నికను వాయిదా వేయాలని ఎపి ప్రభుత్వం కూడా కోరినట్లు వెల్లడించింది. ఎన్నికల నిర్వహణపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న సంగతి తెలిసిందే.