ఇచ్చాపురం జనసేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఇచ్చాపురం: జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి ముందస్తు పుట్టినరోజు సందర్బంగా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధి లొద్దపుట్టి గ్రామంలో తిప్పన సురేష్ మెడికవర్ హాస్పిటల్ బృందం సహాయంతో, మరియు ధర్మపురం గ్రామంలో రామక్రిష్ణ, వాసు, పురుషోత్తం జనసైనికుల సహాయంతో జెమ్స్ హాస్పిటల్ బృందం వారిచే ఉచితంగా మెడికల్ టెస్ట్ మరియు మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 450 మంది ప్రజలకు బీపీ, షుగర్, ఈసీజీ టెస్ట్ లు నిర్వహించగా, కాళ్ళు నొప్పులు మరియు ఇతర సమస్యలతో వచ్చిన పేషెంట్లను చూసి తగిన మందులు ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమానికి తిప్పన దుర్యోధన రెడ్డి నిర్వహించగా, జనసేన పార్టీ నాయకులు దాసరి రాజు, రోకళ్ల భాస్కర్, ధుంగు భాస్కర్ హాజరవ్వటం జరిగింది. ధర్మపురం గ్రామస్తులు హేమంత్, దివాకర్, బోనమాలి, మిగతా జనసైనికులు అందరూ పాల్గొన్నారు.